తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి

తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో పండుగ వేళ విషాదం చోటు చేసుకుంది,  చర్ల మండలం తేగడ గ్రామం వద్ద తాలిపేరు నదిలో ఇద్దరు మృతి చెందారు.  బతకమ్మలు నిమజ్జనం చేసేందుకు నది వద్దకు వచ్చి స్నానం చేసేందుకు నదిలో దిగి మృతి చెందారు. మృతులను గన్నవరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతులను మహీందర్​.. జంపన్నలుగా గుర్తించారు.